ఇదేందిది....ఇది నేను సూడల !

"సామాన్యుడికి దూరం అవుతున్న రైలుబండి" శీర్షికన ఒక వ్యాసాన్ని  ఈ బ్లాగ్ లో రాసుకున్న. నేను రాసుకున్న అన్ని బ్లాగ్ పోస్టుల్లో దీనికి మంచి స్పందన వచ్చింది. పాఠకులు చేసిన వ్యాఖ్యలు నాకు సంతోషాన్ని కలిగించింది. ఆ వ్యాసాన్ని దిశ పత్రిక వార్త,ఆదాబ్ హైదరాబాద్ మొదలగు వాటికి ఈ మెయిల్ ద్వార పంపించాను. ఆదాబ్ హైదరాబాద్ వారు మొన్ననే పబ్లిష్ చేశారు. నా వ్యాసాన్ని పబ్లిష్ చేశారేమో అని ఉదయాన్నే చూస్తూ ఉన్న. ఈరోజు ఉదయం మొబైల్ లో ఈ పేపర్ లో చూస్తుంటే దిశా వారు పబ్లిష్ చేశారు. అలాగే వార్త ఈ పేపర్ కూడా చూసాను.శీర్షికను చూసి అందులో కూడా వచ్చింది అని అనుకున్న. కానీ శీర్షిక లో కొద్దిగా మార్పు వచ్చింది. పేరు ఎవరిదా అని చూస్తే నా పేరు అయితే లేదు. సరే లే....రైలు బండి గురించి వేరే వారు కూడా అభిప్రాయం చెప్తున్నారు గా అని ఆనందం వేసింది. పనిలో పనిగా అందులో ఎలా రాశారు అని చదవడం ఆరంభించాను. వార్త పత్రికలో పబ్లిష్ చేసిన వ్యాసాన్ని పూర్తి గా చదివాక కొన్ని కీలక ఫంక్తులు (lines) నా వ్యాసానికి పోలి ఉన్నాయి. కొద్దిగా బాధ అనిపించింది.వారి మీద నింద మోపే ప్రయత్నం చేయలేను. వార్త లో ప్రచురించిన వ్యాసాన్ని మీ ముందు ఉంచుతున్న. మీరు కూడా చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వార తెలియజేయండి.

Image source: vaartha epaper.

ధన్యవాదాలు.

No comments:

Post a Comment