మిగిలిపోయిన అన్నం...మనకు నేర్పే పాఠం.

భోజన హోటళ్లలో గాని, మన ఇండ్లలో గాని తినగా మిగిలిపోయిన అన్నాన్ని పక్కన పడేస్తుంటాం. ఇది సహజంగా జరిగే ప్రక్రియనే. కానీ ఇందులో సాటి మనిషి గా నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఒకటి ఉంది. అదేంటంటే మనం ఆహారాన్ని ఊపిరి తీసుకున్నట్లు నిరంతరం తీసుకోము. ఉదరానికి అవసరమైనప్పుడు కావాల్సినంత పెట్టుకుని తిని ఆ అవసరాన్ని తీర్చుకుంటాం. కావాల్సినంత అన్నాన్ని తినగా మిగిలిన దాన్ని మనకేం సంబంధం లేదు అన్నట్లు గా ఎంగిలి పళ్లెం లో వదిలేస్తే దానిని మళ్ళీ తీసుకెళ్లి చెత్త బుట్ట లో పడేస్తాం.

ఆకలి అయినప్పుడు అన్నం కోసం తహతహలాడితే అన్నం తిన్నాక మాత్రం ఓడ మల్లన్న బోడి మల్లన్న చందాన ప్రవర్తిస్తూ ఉంటాం. దీని నుంచి నేను చెప్పదల్చుకుంది ఏంటంటే మనిషిని నడిపేది,పరిగెత్తించేది అవసరం మరియు ఆశ. అవసరం తీరకముందు ఒక వస్తువు కానీ వ్యక్తి కానీ అవసరం అని మనకు తోచితే అదే అవసరం తీరాక అనవసరంగా మారుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అవసరం ముందు అవసరం తరువాత అనే రెండు దశల ప్రక్రియ. మొదటి దశ లో కలిస్తే రెండవ దశ లో విడిపోతాం. జీవితం లో ఒకప్పుడు మన పక్కన ఉండి ఇప్పుడు లేరు అంటే కారణం "తరువాత" దశ లో ఉన్నాం అని. కాబట్టి మనతో ఎల్లప్పుడూ ఉంటారు అనుకోవడం అమాయకత్వం ఎందుకంటే వారి అవసరాలు ఎల్లప్పుడూ తీర్చలెం అలాగే వారికి అవసరం కూడా రాకపోవచ్చు. ఒకవేళ ఉంటున్నారు అంటే ఇంకా ఏదో చేయాల్సిఉందని అర్థం.

మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయగలరని ఆశిస్తున్నా.

2 comments: