క్రమశిక్షణ కు చిహ్నం అయోధ్య కేసు రాజ్యాంగ ధర్మాసనం రంజన్ గొగోయ్ అండ్ కో..

అయోధ్య భూ వివాదం కేసులో అగ్ర న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో నేను గ్రహించిన ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అయోధ్య కు సంభందించి ఇరు పక్షాల వాదనలు పక్కన పెడితే అసలు ఈ అయోధ్య భూ వివాదం కోర్టు దాకా వచ్చిన తర్వాత పరిష్కారం అవడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది ? ఎన్నో పెద్ద పెద్ద కేసులు పరిష్కరించిన న్యాయస్థానాలు ఈ కేసు వద్ద మాత్రం ఎందుకు ఇంత కాలం సాగదీసుకు వచ్చారు ? మొదలగు ప్రస్నలకు సమాధానం న్యాయమూర్తుల వైఖరి జవాబు ఇస్తుంది. వారికే కాదు సామాన్య పౌరులకి సైతం ఈ కేసు పేరు చెప్తే ఇది ఈ శతాబ్దానికి ముడిపడదు అనే భావించే వాళ్ళం.
కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తాను పదవి విరమణ చేసెకంటే ముందే ఈ కేసుకి శాశ్వత పరిష్కారం చూపాలని దృఢ సంకల్పించి నలభై రోజుల పాటు నిత్యం ఐదుగురు సభ్యుల రాజ్యంగా ధర్మాసనం విచారణ జరుపుతూ అసాధ్యం అనుకున్న కేసుకు శాశ్వత లోప రహిత, నిష్పక్షపాతంగా పరిష్కారం చూపగలిగారు.

ఇక్కడ మనం గ్రహించాలసింది ఏంటంటే ఒక పనిని ఎలా అయినా పూర్తి చేయాలని దృఢ సంకల్పం తో పాటు ప్రతి రోజూ లక్ష్యం కోసం క్రమం తప్పకుండా శ్రమిస్తే అసాధ్యం అనుకున్న దానిని సులభంగా సాధించవచ్చు అని.

మొదట అయోధ్య కేసుకు ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తే అందులో ఇద్దరు న్యాయమూర్తులు వైదొలిగారు. ఈ సంఘటన వారికి ఈ కేసు పై ఎలాంటి వైఖరి(సాధ్య/అసాధ్య) ఉన్నదో గ్రహించవచ్చు.

అలానే ఒకసారి విచారణ జరిపి మళ్ళీ మూడు నెలల తర్వాత విచారణ జరిపి మళ్ళీ ఇంకో... ఇలా చేస్తే లక్ష్యం చేరుకోలేం ,పరిష్కరం చూపలేం. ఈ కేసులో అలా కాకుండా అసలు ఆటో ఇటో తేల్చుకోవాలని నడుం బిగించి ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య కు పరిష్కారం చూపగలిగారు అంటే క్రమశిక్షణ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తుంది.

ఇదే విదంగా రాజకీయ నాయకుల ఆర్థిక నేరాల కేసులలో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తే న్యాయస్థానాల మీద ఉన్న అపరిమిత కేసుల బరువు తగ్గించవచ్ఛని నా అభిప్రాయం.

గమనిక :- మీ అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు.

No comments:

Post a Comment